By - Vijayanand |13 Aug 2023 6:34 AM GMT
సిద్దిపేట జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. రైస్ పుల్లింగ్ కలశంతో అద్భుతాలు సృష్టిస్తామని నమ్మిస్తూ మోసాలు చేస్తోంది ఓ ముఠా. సుబ్బారెడ్డి అనే వ్యక్తి… రైస్ పుల్లింగ్ కలశాన్ని కొనేందుకు ప్రకాశం జిల్లా నుంచి చేర్యాలకు వచ్చాడు. 10 లక్షల 75 వేలు ఇచ్చి కలశం చూపెట్టాలని అడిగాడు. అయితే... మిగిలిన డబ్బులు ఇస్తేనే చూపిస్తామన్న నిందితులు.. చివరికి ఇన్నోవాలో పారిపోయారు. మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి….. చేర్యాల పీఎస్లో ఫిర్యాదు చేశాడు . ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com