
By - jyotsna |30 Dec 2023 12:00 PM IST
తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా తిరుచ్చి - రామేశ్వరం రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ టక్కు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కనున్న ఓ టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.TN: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com