
By - Chitralekha |26 July 2023 5:05 PM IST
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జి కొండూరు మండలం సున్నప్పాడ దగ్గర వరద ఉధృతికి రోడ్డు ధ్వంసమైంది. దీంతో మండలకేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరంలో కాకర్లవాగు పొంగిప్రవహిస్తోంది. దీంతో ముందుజాగ్రత్తగా ఆ మార్గంలో వాహనదారులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం-సరకులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com