బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ విమర్శలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ విమర్శలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్. బడా బాబుల కోసం హైదరాబాద్‌లో కేబుల్‌ బ్రిడ్జిలు కడుతున్న ప్రభుత్వం.. చాలా గ్రామాల్లో వాగులపై వంతెనలు కట్టడం లేదన్నారు. వాగులు దాటుతూ చనిపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. తెలంగాణలో బహుజన వాదం బలపడటాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. అసైన్డ్‌ భూముల్లో ఫాంహౌస్‌ల నిర్మాణంపై కోర్టుకు వెళ్తామన్నారు.

Next Story