
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు.
ఇదిలా ఉంటే, చర్చలు విఫలం కావడంతో ఇరాన్ స్పందించింది. అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ అన్నారు. రష్యా, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూఎస్ దృక్ఫథం మారింది. గతంలో అలస్కా వేదికగా ఉక్రెయిన్, రష్యాల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

