
By -  Vijayanand |26 Jun 2023 11:06 AM IST
వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులు  ఇవాల్టి  నుంచి వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 7 వేల 720  కోట్లు విడుదల చేసింది. సీఎం  నిర్ణయం మేరకు నేరుగా రైతుల ఖాతాల్లోకి వ్యవసాయశాఖ నగదు జమ చేయనుంది. ఈ సీజన్లో కొత్తగా 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దీంతో  300 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా విడుదల చేసిన 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు అందిన రైతుబంధు మొత్తం సాయం 72 వేల 910 కోట్లకు చేరనుంది. ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకు పంట సాయం అందుతుంది. కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. తమ బ్యాంకు ఖాతాల వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


