
By - Vijayanand |16 July 2023 12:17 PM IST
ప్రముఖ సినీ నటి సాయి పల్లవి అమర్ నాథ్ యాత్రలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను తీసుకుని ఇటీవల ఆమె యాత్రకు వెళ్లొచ్చారు. ఫోటోలు, తన అభిప్రాయాన్ని ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అమర్ నాథ్ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేసిందని.. ధైర్యాన్ని పరీక్షించిందని సాయిపల్లవి తెలిపింది. మన జీవితమే ఒక తీర్థయాత్ర అన్నంత అనుభవాన్ని ఇచ్చిందని వివరించారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనేది ఎప్పటినుంచో తనకు ఉన్న కోరిక అని సాయిపల్లవి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com