
By - Vijayanand |10 Jun 2023 5:23 PM IST
సంధ్య శ్రీధర్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాడులు చేయడం, బెదిరింపులకు దిగడమే పనిగా పెట్టుకున్నారు. అర్థరాత్రి గచ్చిబౌలిలో అనుచరులతో కలిసి హంగామా చేశారు. అనుచరులతో కలిసి ఇన్ఫినిటీ హోటల్లోకి చొరబడ్డ సంధ్య శ్రీధర్.. హోటల్లోని వస్తువులన్నింటీని ధ్వంసం చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదుతో సంధ్య శ్రీధర్, ఆయన అనుచరులపై గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదయ్యింది. ఐపీసీ 448, 42, 324, 506 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com