
By - Vijayanand |15 Aug 2023 1:12 PM IST
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తనను అవమానించారంటూ జడ్పీటీసీ పద్మ జాతీయ జెండా స్థంభం వద్ద కింద కూర్చొని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ రూపలను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం జడ్పీటీసీ పద్మ జెండా ఎగురవేయాలి. ఎంపీపీ చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు. ఎంపీపీతో ఎలా ఆవిష్కరిస్తారంటూ జెండా దిమ్మె వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com