
By - Vijayanand |19 Aug 2023 12:25 PM IST
ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో వాలంటీర్ల అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లు వైసీపీకి అనుకకూలంగా వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చలివెందుల గ్రామంలో సర్పంచ్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వాలంటీర్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో అధికార పార్టీ నేతలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com