SHARMILA: రాజధానే లేని దయనీయ రాష్ట్రం.. ఏపీ

SHARMILA: రాజధానే లేని దయనీయ రాష్ట్రం.. ఏపీ

పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కనీసం రాజధాని కూడా లేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేతగా కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తుందని తిరుపతిలో నిర్వహించిన న్యాయ సాధన సభలో..... షర్మిల హామీ ఇచ్చారు. ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వారికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటమని అన్నారు.

Next Story