
ముంబైలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా చేసిన కారు ప్రమాదంలో అసలు వాస్తవం బయటకు వచ్చింది. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు. తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు. తర్వాత బిదావత్ కారు నడిపాడు. కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. మరోవైపు ఈ కేసులో రాజేష్ షాకు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మిహిర్ షా (24) పరారీలో ఉన్నాడు. బిదావత్ను మంగళవారం వరకు పోలీస్ కస్టడీకి పంపుతూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com