తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌

తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌ బాధ్యతలు స్వీకరించారు. 2025 వరకూ ఈ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం రాజనగరానికి చెందిన నిరంజన్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2001లో యూఎస్‌ వెళ్లారు. 2003లో ఐటీ బిజినెస్‌ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ స్థాపించారు. 2008లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యుడిగా చేరారు. తానా అభివృద్ధికి భారీగా విరాళం ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

Next Story