
By - jyotsna |1 Jan 2024 11:15 AM IST
కొత్త ఏడాది జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషెద్పూర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఆదిత్యపూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జంషెద్పూర్ పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com