KARNATAKA: కర్ణాటకలో ఒకే ఇంట్లో అయిదు అస్తిపంజరాలు

KARNATAKA: కర్ణాటకలో ఒకే ఇంట్లో అయిదు అస్తిపంజరాలు

కర్ణాటక చిత్రదుర్గలోని ఓ ఇంట్లో ఐదు అస్తిపంజరాలు బయటపడటం....కలకలం రేపింది. పాత బెంగళూరులోని జైలురోడ్డులో ఓ పాడుబడిన ఇంట్లో... అస్తిపంజరాలు ఉన్నట్లు మీడియా ప్రతినిధులు పోలీసులకు...సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చిత్రదుర్గ పోలీసులు... ఇంటి లోపలికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఒక గదిలో మంచంపై రెండు, నేలపై మరో రెండు అస్తి పంజరాలు కనిపించాయి. అవన్నీ నిద్రపోతున్న భంగిమలో.... ఉన్నాయి. మరో గదిలో ఐదో అస్తిపంజరాన్ని గుర్తించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అస్తి పంజరాల నమూనాలు... ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అస్తి పంజరాలన్నీ ఆ ఇంటి కుటుంబ సభ్యులవే అని...ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ ఇంటి సభ్యులంతా ఇతరులకు దూరంగా ఉండేవారని, అనారోగ్యంతో బాధపడేవారని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు...పోలీసులు వెల్లడించారు.

Next Story