
By - Chitralekha |23 Aug 2023 3:12 PM IST
140 కోట్ల భారతీయుల కల చంద్రయాన్ 3 ద్వారా నెరవేరబోతుందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరుకుంటు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లోని శ్రీ భద్రకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖగోళంలోని చరిత్రను కనుక్కున్న గొప్పదేశం మన భారత దేశమన్నారు. ఆనాడు వాజ్పేయి ప్రభుత్వ హాయంలో చంద్రయాన్కు అంకురార్పణ జరిగిందని తెలిపారు. నేడు ప్రధాని మోదీ హాయంలో చంద్రయాన్ 3 విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్ధించామని రాకేష్ రెడ్డి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com