
By - Chitralekha |2 Aug 2023 5:22 PM IST
విజయవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదన్ సిబ్బంది గుండు కొట్టించింది. దీనిపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల సదన్లో పర్యటించిన కమిషన్ సభ్యులు బాధిత పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలసదన్ సూపరింటెండెంట్, ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ పీడీకి నోటీసులిచ్చారు. ఈనెల 8న బాలల హక్కుల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే బాలల తలలో కురుపులు ఉన్నాయనే ఉద్దేశంతో గుండు చేయించామని బాలల సదన్ సిబ్బంది చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com