
By - Chitralekha |24 Aug 2023 4:55 PM IST
విశాఖలో విద్యార్థి రీతు మృతి కేసును పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. సీసీ ఫుటేజ్ను సీపీ త్రివిక్రమ వర్మ విడుదల చేశారు. రీతూ ఓ హాస్టల్లో ఉంటూ నీట్కు ప్రిపేర్ అవుతుందన్నారు. 14న భవనం పైకి వెళ్లి దూకడంతో గాయపడిందని హాస్టల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించారని.. 16న మృతి చెందిందని వెల్లడించారు. హత్య కోణంలో ఆధారాలు లభించలేదన్నారు. తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారని అన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com