
By - Chitralekha |28 July 2023 1:31 PM IST
కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి నుంచి భారీగా ఇన్ఫ్లో రావడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది.ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 1.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రాజెక్ట్ లోకి ఇన్ఫ్లో 4500 క్యూసెక్కులు కాగా..అవుట్ ఫ్లో 4500 క్యూసెక్కులగా ఉంది. ఒక్క గేటు ఎత్తి తుంగ భద్ర నదిలోకి నీరు వదులుతున్నారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com