రాహుల్ గాంధీ పిటీషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు

రాహుల్ గాంధీ పిటీషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు

గుజారాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. ఈ నెల 21న విచారించనున్నట్లు తెలిపింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్నారు రాహుల్. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించింది సూరత్ కోర్టు. దీంతో అనర్హత వేటకు గురైన రాహుల్ ఎంపీ పదవి పోగొట్టుకున్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ తీర్పును సమర్ధించింది గుజరాత్ హైకోర్టు. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు రాహుల్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దీనిపై నెల 21న విచారించనున్నట్లు తెలిపింది.

Next Story