
By - Chitralekha |22 July 2023 3:08 PM IST
అనేక అంతర్జాతీయ, సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగ్లో జరిగిన 7వ రోజ్ గార్ మేళా కార్యక్రమంలో కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్ సహా 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 5 లక్షలపైగా ఉద్యోగాలు కల్పించామని కిషన్రెడ్డి తెలిపారు. దేశ చరిత్ర ఇంత మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేపట్టడం ఇదే తొలిసారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com