ఉప్పల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఉప్పల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేశారు. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా సిబ్బందిపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటపడి మరి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే దాష్టికం ప్రదర్శించారు.

Next Story