By - Chitralekha |29 July 2023 10:49 AM GMT
మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేశారు. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా సిబ్బందిపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటపడి మరి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే దాష్టికం ప్రదర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com