
By - Chitralekha |2 Aug 2023 1:09 PM IST
వరద బాధితులకు తెలంగాణ తెలుగుదేశం బాసటగా నిలబడింది. టీ.టీడీపీ అధ్యక్షులు కాసాని ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించా రు. దుప్పట్లు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సరుకులతో నిండిన వాహనాలు వరంగల్, ఖమ్మం జిల్లాకు బయల్దేరాయి. అదేవిధంగా మృతుల కు టుంబాలను గుర్తించి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com