CM Stalin: స్కూల్‌ విద్యార్థుల కోసం అల్పాహార పథకం

CM Stalin: స్కూల్‌ విద్యార్థుల కోసం అల్పాహార పథకం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి ఈ తరహా పథకాన్ని సీఎం స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 31వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 17లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆకలి బాధలు లేకుండా చిన్నారులు పాఠశాలకు వెళ్లడం, పిల్లలు పోషకార లోపంతో బాధపడకుండా చూడటం, రక్త హీనత వంటి సమస్యల్ని విద్యార్థులు అధిగమించడం లక్ష్యాలు పేర్కొన్నారు.

Next Story