ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

టీఎస్‌ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈనెల 2న ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపించారని.. మూడో తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం మాత్రమే అభ్యర్థించారని తెలిపారు. ఈ బిల్లును పరిశీలించడానికి, లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. దాంతో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్‌ ఆమోదముద్ర వేయడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ను ఆపడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చే యోచన చేస్తున్నారు.

Next Story