
By - Sathwik |29 Oct 2023 6:45 AM IST
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇప్పటికే మోత మోగిద్దాం, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం' అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇవాళ రేపు రాత్రి 7 నుంచి 7 గంటల ఐదు నిమిషాల మధ్య ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా 'నిజం గెలవాలి' అంటూ నినాదాలుచేయాలని సూచించారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేశ్ కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com