విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడలో టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోడూరు సుబ్రహ్మణ్యం దుకాణం కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సుబ్రహ్మణ్యంను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అడ్డుకున్నారు పోలీసులు. తాడిగడప వద్ద ఆయన్ను అడ్డుకోవడంతో.. పోలీసులకు, కొల్లురవీంద్రకు మధ్య వాగ్వాదం జరిగింది. బీసీలపై దాడుల్ని ఖండిస్తే నేతల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు కొల్లు రవీంద్ర. ప్రభుత్వం బీసీలపై దాడులు, హత్యలు చేస్తుందంటుూ ఆరోపించారు. బీసీ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, పోలీసులను పావులా వాడుకుంటోందంటూ పైర్ అయ్యారు.

Next Story