By - Vijayanand |18 Aug 2023 10:58 AM GMT
పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్ఛార్జులతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో ప్రారంభంకానున్న బస్సుయాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. బస్సు యాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొంటారని, గ్రేటర్లో బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైందని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, యాత్ర తేదీని రేపు చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. గ్రేటర్లో టీటీడీపీ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు కాసాని జ్ఞానేశ్వర్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com