By - Sathwik |15 May 2024 6:00 AM IST
దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. వారణాసి బీజేపీ అభ్యర్థిగాప్రధా ని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందని ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారతమే లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయేదే విజయం అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com