
ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో వైసీపీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రాల్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య ,గరటయ్య పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం లోకి ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com