ఆగస్ట్‌ 2న కడప జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు

ఆగస్ట్‌ 2న కడప జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రభుత్వం అనుమతివ్వకపోయినా చంద్రబాబు పులివెందుల రోడ్‌షో కొనసాగుతుందన్నారు టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి. ఆగస్ట్‌ 2న కడప జిల్లాలో గండికోట, పైడి కాలువ ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు సందర్శిస్తారని చెప్పారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోనే కాదు.. పులివెందులలో కూడా అభివృద్ధి జరగలేదన్నారు. 3 వేల కోట్ల ప్రాజెక్ట్‌ పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు రాలేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దుస్థితిని బయటి ప్రపంచానికి చెప్పడానికే చంద్రబాబు వస్తున్నారని తెలిపారు.

Next Story