
By - Chitralekha |3 Aug 2023 2:52 PM IST
అమరావతి ఆర్5 జోన్పై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల భూమిని వేరొకరికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎవడంటూ ప్రశ్నించారు. రైతుల చేతితోనే వారి కళ్లు పొడుస్తున్నాడంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలు, యాజమాన్యాలను అక్రమ కేసులతో వేధిస్తున్నాడని 6 దశాబ్ధాల చరిత్ర ఉన్న సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మొట్టికాయలు పడినా మూర్ఖుడికి బుద్ధి రావట్లేదంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com