
By - Vijayanand |7 Aug 2023 11:55 AM IST
పోలవరం ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టిసీమ,పోలవరం ప్రాజెక్టులు సందర్శించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈనేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి కేవలం 14 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఉభయగోదావరి జిల్లాలో సీఎం,ప్రతిపక్ష నేతల పర్యటన ఒకే రోజు ఉండటంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ రాత్రికి రాజమండ్రిలోబస చేయనున్నారు జగన్,చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com