AP : ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాల పిలుపు

AP : ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాల పిలుపు

చిత్తూరు జిల్లా రామకుప్పంలో హైటెన్షన్ నెలకొంది. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. అనుమతులు లేకున్నా నిరసన వ్యక్తం చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. 4 మండలాల నుంచి టీడీపీ శ్రేణులు, దళిత నేతలు రామకుప్పం చేరుకుంటున్నారు. గత వారం కుప్పం కోర్టు ఆవరణలో.. టీడీపీ మాజీ సర్పంచ్‌ మహాదేవి జయశంకర్‌ను రామకుప్పం ఎస్‌ఐ కృష్ణయ్య దూషించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Next Story