
By - Chitralekha |26 May 2023 4:44 PM IST
జగన్ ప్రభుత్వంలో యువత, మహిళలు,రైతులు దగా పడ్డారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము. మహానాడుతో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించబోతుందని అన్నారు. రేపు జరిగే ప్రతినిధుల సభకు 20వేల మంది హాజరు అవుతారని, ఎల్లుండి జరిగే బహిరంగ సభకు 15 లక్షల మంది హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలనపై విసిగిపోయారని అన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీకి రూ. 5 లక్షలు విరాళం అందించారు నల్లపాటి రాము.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com