
By - Vijayanand |9 Aug 2023 4:01 PM IST
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగు గంగ కాలువ పనులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరిశీలించారు. కాలువలకు నీళ్లు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కమీషన్లు తీసుకోవడం, కబ్జాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందడంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు రైతుల కష్టాలు పట్టవా అంటూ మండిపడ్డారు. పంటలకు నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిలప్రియా. గంగుల కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చినా ఆళ్లగడ్డ నియోకజవర్గానికి ఎలాంటి ఉపయోగంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలప్రియ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com