
By - Vijayanand |14 Aug 2023 5:07 PM IST
ప్రజా వేదిక కూల్చివేసిన సీఎం జగన్ స్ఫూర్తితో గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులను ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. అధికారులు మానవత్వం లేకుండా ఇష్టానుసారం ఇళ్లను కూల్చివేశారని ధూళిపాళ్ల మండిపడ్డారు. రోడ్డు విస్తరణను వైసీపీ కార్యక్రమంలా మార్చివేశారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడిన వారందరినీ టీడీపీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతామని ధూళిపాళ్ల హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com