
By - Chitralekha |2 Aug 2023 12:48 PM IST
అశేష జనవాహిని మధ్య నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జనాలు ఎగబడుతుండటంతో ఆయనకు పలుచోట్ల గాయాలు అవుతున్నాయి. అయినా పట్టు వదలకుండా లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి పాదయాత్రలో నారాలోకేష్ చేతికి గాయాలయ్యాయి. వేళ్లకు బొబ్బలెక్కడంతో ఇబ్బంది పడుతున్నారు.జన తాకిడి ఎక్కువగా ఉండటంతో చేతికి పలుచోట్ల గాయాలయ్యాయి. ఒక గాయం మానే లోపే మరో గాయం అవుతుండటంతో టీడీపీ కేడర్ ఆందోళనకు గురవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com