By - Chitralekha |22 July 2023 6:10 AM GMT
టీడీపీ యువనేత నారా లోకేష్ మరోసారి సీఎం జగన్పై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ఎందరో మహానుభావులు.. ఒక్కరే చీప్ మినిస్టర్ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి మొదలు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ వర్సెస్.. చెత్త సీఎం జగన్ అంటూ ట్విట్టర్లో ఫొటోలు పెట్టి మరీ కడిగిపారేశారు. గత ముఖ్యమంత్రుల హయాంలో ఉమ్మడి ఏపీ, విభజన ఆంధ్ర ఎంతో అభివృద్ధి సాధిస్తే.. కేవలం నాలుగేళ్ల జగన్ పాలనలో అభివృద్ధి లేక ఏపీ సర్వనాశనమైందని అర్థం వచ్చేలా నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com