పుంగనూరు ఘటనపై పరిటాల శ్రీరామ్ ఫైర్

పుంగనూరు ఘటనపై పరిటాల శ్రీరామ్ ఫైర్

పుంగనూరు ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలన సాగిస్తోందన్నారు.చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తుంటే వైసీపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.ప్రతిపక్ష నేతపైనే దాడులకు తెగబడుతున్నారంటే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రజలపై రాళ్లు విసరడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ యూనిఫామ్ పక్కన పెట్టి వైసిపి కండువాలు కప్పుకుంటే సరిపోతుందన్నారు. పుంగనూరు, సంఘటనలపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story