By - Chitralekha |7 Aug 2023 11:22 AM GMT
వైసీపీ అక్రమాల్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఫైరయ్యారు. మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలో నగిరి ఓటర్లు ఆమెకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. నాలుగేళ్లలో అక్రమంగా ఎంతో సంపాదించారని ఆరోపించారు. నగిరి నియోజవర్గం ఇసుక, మట్టి దందాలకు నిలయంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా చెలరేగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com