ఐప్యాక్‌పై టీడీపీ నేత విజయ్ కుమార్‌ ఫైర్

ఐప్యాక్‌పై టీడీపీ నేత విజయ్ కుమార్‌ ఫైర్

ఐప్యాక్‌పై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజల డేటా అంతా ఐప్యాక్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. ఐప్యాక్ సంస్థ వైసీపీ కోసం పనిచేస్తూ, ప్రజల సమాచారాన్ని వైసీపీ ప్రయోజనాలకు తగినట్టు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమన్నారు. ఐప్యాక్ ఆదేశాలతోనే వైసీపీ వాలంటీర్ల ద్వారా ఇతర పార్టీవారి ఓట్లను తొలగిస్తోందన్నారు. ఓటర్ పరిశీలనకు వెళ్లిన బీఎల్ఓల వెంట వాలంటీర్లు వెళ్లడం అధికారపార్టీ కుట్రలో భాగమేనన్నారు.

Next Story