పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మ గుంట పంచాయతీ ఉప ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్ర వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ లాఠీ చార్జ్ చేశారు. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి దర్జాగా వెళ్ళి వస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story