
By - Vijayanand |9 July 2023 2:04 PM IST
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చలో కూనవరం కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభను అడ్డుకోకుండా.. పోలీసులు టీడీపీ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేయడంపై దుమారం రేపుతోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజును అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు. తమను అక్రమంగా ఎందుకు అరెస్టులు చేస్తున్నారంటూ పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అటు జిల్లాలో ముందస్తు అరెస్టులు, పోలీసుల తీరుపై టీడీపీ, గిరిజన సంఘం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com