
ఏపీలో అశేష జనాభిమానాన్ని చూరగొంటున్న తెలుగుదేశం పార్టీ.. ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనుంది. 45 రోజులపాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది. ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ప్రతి ఇంటిని టచ్ చేసేలా కొత్త కార్యక్రమం రూపకల్పన జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి వారానికి ఐదు రోజులపాటు ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు- ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు పూర్తి చేసిన టీడీపీ..
మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ఇవాళ్టి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు.
అటు.. ఇండియాటుడే- సీ ఓటర్ సర్వేలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైంది. ఐతే.. ఏపీలో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సభలకు అశేష ప్రజాధరణ కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. అత్యధిక స్థానాలు వస్తాయన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com