PARLIAMENT: పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఆందోళన

PARLIAMENT: పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఆందోళన

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలన్నారు.


సీఎం జగన్ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్న ఎంపీలు …చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలూ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. పార్లమెంట్ లోనూ తమ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

Next Story