
By - Chitralekha |19 July 2023 5:36 PM IST
కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ, నిధులు లేని జీవోను ఇచ్చారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్. నాలుగేళ్లుగా హంద్రీనీవా ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు కదల లేదని ధ్వజమెత్తారు. ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి కానీ, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం, వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కుప్పం నియోజకవర్గానికి, మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డికి సంబధమే లేదని, కుప్పం ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఎవరు స్దానికులో ఎవరు నాన్ లోకలో తేల్చుకోవాలని, మంత్రి పెద్దారెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ శ్రీకాంత్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com