
By - Chitralekha |26 July 2023 1:17 PM IST
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. కాకాని వ్యవసాయ శాఖ మంత్రిగా అనర్హుడు అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో కరోనా ప్యాలెస్ కట్టిన ఘనుడు అంటూ మండిపడ్డారు. వ్యవసాయం గురించి ఏం తెలుసని నోరు పారేసుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. రైతులకు అందే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను కూడా నిలుపుదల చేసినందుకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. అగ్రోస్ చైర్మన్ సీఎంకు రాసిన లేఖపై మంత్రి ఏం సమాధానం చెప్తాడని సోమిరెడ్డి నిలదీశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com