
By - Vijayanand |3 Aug 2023 6:45 PM IST
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ పార్టీ రాష్ట్ర నాయకుల బృందం పర్యటించింది. ములుగు నియోజకవర్గంలోని కొండాయి, ప్రాజెక్ట్ నగర్, మల్యాల, పస్రా గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. ఏటురు నాగారంలోని పునరావాస కేంద్రంలోని వరద బాధితులను పరామర్శించి, నిత్యవసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరదల్లో మరణించిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com