
కడపలో సమస్యలు పరిష్కరించలేదని ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమయ్యారు.దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం, 41 నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ U.T.F. ఆధ్వర్యంలో.. మహావీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో C.P.S. రద్దు చేస్తానన్న హామీ.. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్న ఆ ఊసే ఎత్తకపోవడం దారణమన్నారు. గత రెండేళ్ల నుంచి పెండింగ్ లో ఉంచిన 18 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com